Friday, April 19, 2024
Friday, April 19, 2024

లారీ ఢీకొనడంతో ముగ్గురకు తీవ్ర గాయాలు

. ఒకరి పరిస్తితి విషమం
. రెండుఎద్దులుమృతి
. మరొక ఎద్దు పరిస్థితి విషమం

విశాలాంధ్ర – బెలగాం : లారీఢీకొనడంతో ముగ్గురు గాయపడగా, రెండుఎద్దులు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉందని ఎద్దుకు కూడ తీవ్ర గాయాలైన సంఘటన గురువారం వేకువజామున పార్వతీపురం- సీతానగరం మధ్యలో రాష్ట్రీయ రహదారిపై చోటుచేసుకుంది. పార్వతీపురం ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మండలం కారాడవలస గ్రామానికి చెందిన పిన్నింటి సాంబయ్య, అదే గ్రామానికి దొగ్గ తిరుపతి, దొగ్గ రమేష్ లతో కలసి నాటుబండ్లను తోలుకొని సీతానగరం నదిలో ఇసుకను తీసుకొని రావడానికి వెళుతుండగా సీతానగరం మండలం మరిపివలస గ్రామానికి సమీపంలో ఉన్న కోనేరు ముందు బొబ్బిలి వైపు నుండి పార్వతీపురం వస్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈసంఘటనలో సాంబయ్య, తిరుపతి, రమేష్ లు రోడ్డుపై తుళ్ళిపడడంతో ముగ్గురకు తీవ్ర గాయాలయ్యాయి, రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ముగ్గురిని 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఒకరి పరిస్తితి విషమంగా ఉండగా మెరుగైనవైద్యచికిత్స కోసం విశాఖ రిఫర్ చేశారు.ఔట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img