విశాలాంధ్ర – పార్వతీపురం:గురువారం ఉదయం నాల్గున్నరగంటలసమయంలో లారీఢీకొనడంతో ముగ్గురుగాయపడగా, రెండుఎద్దులుమృతిచెంది ఒకఎద్దుకు తీవ్ర గాయాలైన సంఘటన సీతానగరం- పార్వతీపురం సరిహద్దులో జరిగింది.పార్వతీపురం ఔట్ పోస్టు పోలీసులు వివరాలను వెంటనే నమోదు చేశారు. కానీ సీతానగరం సరిహద్దులో జరగడంవల్ల సాయంత్రంవరకు సీతానగరం పోలీసులునుండి సమాచారం అందలేదని, అందుకే పశువులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదని నిడగల్లు పశువైద్యులు రామారావు తెలిపారు. ప్రమాదంజరిగిన సమయంలో సంఘటన తెలుసుకొని గాయపడిన పశువులకు కూడా చికిత్సచేశానని ఆయనతెలిపారు. పార్వతీపురం మండలం కారాడవలస గ్రామానికి చెందిన పిన్నింటి సాంబయ్య, దొగ్గ తిరుపతి, దొగ్గ రమేషులు కలసి నాటుబండ్లను తోలుకొని సీతానగరంనదిలో ఇసుకను తీసుకొని రావడానికి వెళుతుండగా ఈప్రమాదం జరిగింది.ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ముగ్గురిలో ఒకరిపరిస్తితికూడా సీరియస్ కావడంతో అతన్ని మెరుగైనవైద్యచికిత్సకోసం విశాఖకు రిఫర్ చేశారు. రెండుఎడ్లు మృతిచెంది, ఒకఎద్దు పరిస్తితి విషమంగా ఉందని, ముగ్గురూ చికిత్స పొందుతుండగా రైతులను ఆదుకునేందుకు తగుచర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. ఎడ్లుతోపాటు ఎడ్లబండుల యజమానులు గాయపడటంతో వారికి ఆన్నివిధాలా న్యాయంచేయాలని, పశువులకు భీమా ఇప్పించాలని కారాడవలస గ్రామస్తులు కోరుతున్నారు. పార్వతీపురం నుండి మెడికల్ ఇంటిమేషన్ ఆలస్యంగా వచ్చినందున కేసునమోదు ఆలస్యంగా జరిగినందున శుక్రవారం పశువులకు పశువైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టంను చేయిస్తామని సీతానగరం ఎస్ ఐ నీలకంఠం తెలిపారు. ఇదిలాఉండగా ప్రమాదంలో మృతిచెందిన రెండుఎడ్లుని రైతుల కుటుంబ సభ్యులు తెలియక పాతిపెట్టారని తెలిసింది. కేసు నమోదు చేసినందున పాతిపెట్టిన పశువులని శుక్రవారం బయటకుతీసి పోస్ట్ మార్టం చేయనున్నారని తెలుస్తోంది