Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

గిరిజన గురుకులాల్లో ఉద్యోగ అవకాశాలలో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలి

విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యం జిల్లాలో కొత్తగా గిరిజన గురుకులాల్లోని చేయనున్న నియామకాల్లో గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు పీఓకువినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.
పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడంతో గిరిజన నిరుద్యోగులు నిరాశతో ఉన్నారని, గిరిజన గురుకులంలో గిరిజన నిరుద్యోగ అభ్యర్థులతో పోస్టులు నింపాలన్నారు. గతంలో ఏకలవ్య ఉపాద్యాయుల ఉద్యోగాలు గిరిజనేతరులకు అవకాశం ఇచ్చారన్నారు. దీనితో గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని, ఈసారైనా గిరిజన గురుకులంలో గిరిజనులకు అభ్యర్థులు అవకాశాలు ఇవ్వాలని,
ఈనియామకాలను రోస్టర్ పాయింట్ విధానాన్ని రద్దుచేసి పూర్తి స్థాయిలో గిరిజన సంస్థలో గిరిజనులకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐటిడిఏ ప్రోజెక్టు ఆఫీసరుకు గిరిజన సంఘాల నాయకులు దుక్క సీతారాం, ఆరిక చంద్రశేఖర్, పల్ల సురేష్ తదితరులు వినతిపత్రం అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img