Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

త్వరితగతిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోండి

ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపు
విశాలాంధ్ర సీతానగరం: మండలంలోని అర్హులైన గ్రాడ్యుయెట్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదును త్వరితగతిన చేసుకోవాలని ఎమ్మెల్యే జోగారావు పిలుపునిచ్చారు.శుక్రవారం  మండలంలోని చినభోగిలి, తామరకండి, బగ్గొందొరవలస,గెడ్డలుప్పి, కాశాపేట, లచ్చయ్యపేట గ్రామాల సచివాలయాలలో   మండలంఅధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదుపైసమావేశం నిర్వహించారు. ప
ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి గడువు సమయం లోపు శతశాతం ఓట్లనమోదు పూర్తి చేయాలని బిఎల్ఓలకు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లుకు దిశానిర్దేశం చేశారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు  ఎంపీపీ బలగ రవనమ్మ,జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు శ్రీరాములునాయుడు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img