Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్టీసీ ఎం డి

విశాలాంధ్ర,పార్వతీపురం:పార్వతీపురం  మన్యం జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆర్టీసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమలరావును మన్యం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు  మర్యాద పూర్వకంగా కలిసి జ్ఞాపికగా మొక్కను అందజేశారు. ఆర్టీసి ఎండి ద్వారక తిరుమలరావు పోలీసులనుండి గౌరవ వందనం స్వీకరించి, ఎస్పీ క్యాంప్ కార్యాలయం, అతిధిగృహం జిల్లాలోని ఇతర భవనాలను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి గూర్చి, కొత్త జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలపై ఆయన జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించి సిబ్బందితో పలు అంశాలపై మాట్లాడారు.ఆర్టీసీ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.జిల్లా ఎస్పీ వెంట పార్వతీపురం మన్యం డిఎస్పీ ఎ.సుభాష్, ఎస్బి సిఐ ఎన్.శ్రీనివాసరావు, పార్వతీపురం సిఐ విజయానంద్ మరియు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img