Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టీడీపి ఆధ్వర్యాన నాటి అన్నా క్యాంటీన్ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమం


విశాలాంధ్ర – పార్వతీపురం : నాడుటీడీపీ ఆద్వర్యంలో పేదలకుఐదురూపాయలకే భోజనాన్ని సమకూర్చిన అన్నా కాంటీన్ తీసేసి నేడు వైఎస్సార్సీపీ పారిశుధ్య కార్యాలయం ఏర్పాటు చేయటంమేనా అభివృద్ధా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీద్వారపురెడ్డి జగదీశ్, టీడీపి నియోజక వర్గ ఇంచార్జి, మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఛాలెంజ్ చేశారు. గురువారం పట్టణంలోని నాటి ఆన్నా క్యాంటీన్ తీసి నేడు వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన పురపాలక పారిశుధ్య కార్యాలయం వద్ద నియోజక వర్గ టీడీపీ నాయకులతో కలిసి సెల్పీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం వారం ఒక్కో కార్యక్రమంపై టీడీపీ ఆద్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు.గత నాలుగేళ్లుగా ఎక్కడ అభివృధి జరిగిన సందర్భం లేదన్నారు.ఈకార్యక్రమంలో పార్వతీపురం పట్టణ, మండలఅధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్, దొగ్గ మోహనరావు, పట్టణ అధ్యక్షుడు గుంట్రెడ్డి రవికుమార్, సీతానగరం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు, పట్టణ కౌన్సిలర్లు బడే గౌరునాయుడు, తాతపూడి వెంకటరావు, కోలా సరితమధుసూధనరావు, పార్టీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, గర్భాపు ఉదయభాను కోలాబాబు,బోను దేవీచంద్ర మౌళి, నారాయణరావు, కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి,  మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు, మరియదాస్, జాగాన రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img