Friday, April 26, 2024
Friday, April 26, 2024

తోటపల్లి కుడికాలువ నీటిని తగ్గించాలి

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని నిడగల్లు, నీలకంఠపురం, వెంకట పురం, జోగమ్మపేట, బుడ్డిపేట, లక్ష్మీపురం, ఎగోటివలస, దయానిధిపురం, గాదెల వలస తదితర గ్రామాల పంటపొలాల మద్యలో వెళ్తూ పంటలకు సస్యశ్యామలం చేస్తున్న తోటపల్లి కుడికాలువ నీటిని తగ్గించాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు. పంటలు పండి కోతకు రావటంతో నీటిని తగ్గిస్తే కోతలు ప్రారంభం చేస్తామాని వారు తెలిపారు. దీంతో విశాలాంధ్ర రిపోర్టర్ ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లగా తక్షణమే తగుచర్యలు తీసుకొని నీటిని తగ్గిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img