యశోద ఆసుపత్రికి తరలింపు
నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ.ఈ విచారణ సందర్భంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఈడీ కార్యాలయంలో కలకలం రేగింది. ఆయనని వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా రమణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు, ఎల్.రమణను ఈడీ అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించారు. తాను నేపాల్ బిగ్ డాడీ ఈవెంట్ కు వెళ్లలేదని ఎల్.రమణ అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం.