విశాలాంధ్ర, మల్కాజిగిరి : ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధి లోని కల్యాణ్ నగర్లో కార్పొరేటర్ వై ప్రేం కుమార్ సర్కిల్ ఈఈ లక్ష్మణ్, ఇతర అధికారులతో కలసి పర్యటించారు. కాలనీవాసులు రోడ్లు డ్రైనేజీ, విద్యుత్ స్తంబాల తరలింపు, ట్రాన్స్ ఫార్మర్ ఎత్తులో మార్పులు చేయాలని కార్పొరేటర్ ప్రేం కుమార్ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాలనీల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే సహారంతో కాలనీ అభివృద్ధిని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ శ్రీకాంత్, కాలనీవాసులు శ్రీమాన్ నారాయణ, సోమేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.