కేసీఆర్ బహిరంగ సవాల్ను కేంద్రం తరపున తాను స్వీకరిస్తున్నట్లు ్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్లోలో దేశానికి ఏం చేసిందో చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీ ముందు అమరుల సాక్షిగా కేసీఆర్తో చర్చకు సిద్ధమన్నారు. అయితే ఒక షరతు ఉందని, కేసీఆర్ ప్రజలు మాట్లాడే భాష మాట్లాడాలని అన్నారు. బీజేపీకి దేశమే ముఖ్యమని… వ్యక్తులు, కుటుంబం కాదన్నారు. కానీ కేసీఆర్కు వ్యక్తులు, కుటుంబం మాత్రమే ముఖ్యమని అన్నారు. భారత రాజ్యాంగంను ప్రపంచం అంతా పొగడని దేశం ఉండదన్నారు. ఇండియా అంటే ఇందిరా అనే నినాదాన్ని రాజ్యాంగం ద్వారనే ఓడిరచారని అన్నారు. రాజ్యాంగ హక్కు వల్లనే హుజురాబాద్లో కేసీఆర్ ఓడిపోయారని అందుకే రాజ్యాంగం మారాలని అంటున్నారని మండిపడ్డారు.బీజేపీకి నడ్డా తరువాత ఎవరు అధ్యక్షుడు అవుతారో ఎవరూ చెప్పలేరని…కానీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత కేటీఆర్ అధ్యక్షుడు అవుతారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కేసీఆర్ డైనింగ్ టేబుల్పై నిర్ణయాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు.