గురుకుల కళాశాలలో 15 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కొన్నాళ్లుగా కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. వాటిలోనూ ఎక్కువగా జీహెచ్ఎంసీ లోనే నమోదు కావడంతో.. జిల్లాల్లో పెద్ద పట్టించుకోవడం లేదు. కేసుల తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో.. మాస్క్ తప్పనిసరి వంటి నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు.ఈ నేపథ్యంలో.. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో కరోనా కలకలం సృష్టించింది. నార్కట్పల్లి గురుకుల కళాశాలలో ఒకేసారి 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ కళాశాలలోనే ఐసోలేషేన్్ సెంటర్ ఏర్పాటు చేశారు. వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికి వైరస్ ఎలా సోకింది.. వీరు ఎవరెవరినీ కలిశారు అనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు. కళాశాలలో ఉన్న మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.