: డీహెచ్ శ్రీనివాసరావు
కరోనా నుంచి పూర్తి రక్షణకు రెండు డోసుల టీకాను తీసుకోవాల్సిందేనని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చాలా మంది మొదటి మోతాదు తీసుకున్న వారు సెకండ్ డోసు సరైన వేళకు తీసుకోవడం లేదని, తొలి డోసు తర్వాత నిర్ణీత గడువులోగా రెండో డోసు తీసుకోవాలని సూచించారు. సరైన వేళకు రెండో మోతాదు తీసుకుంటేనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని చెప్పారు.