: రేవంత్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిరచింది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగిస్తూ, మైకులు ఆపేసి చర్చ లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తప్పుబట్టారు. రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడుతున్నారని రేవంత్రెడ్డి విమర్శించారు. ప్రధాని దిష్టిబొమ్మలను ఎక్కడికక్కడ దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రజా ఉద్యమాల ద్వారా ఎదగలేదని అన్నారు.