తెలంగాణ ఎదుగుతుందంటే ప్రధాని మోదీ ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. పార్లమెంటులో తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్పై స్పందించారు. తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉంటే ప్రధానికి నచ్చట్లేదని అన్నారు. ముఖ్యంగా తెలంగాణపై ఆయన అక్కసు ఇంకా పెరుగుతుందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపారాన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించకపోవడం వివక్షకు నిదర్శనమని అన్నారు.