Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మత చిచ్చు పెట్టి బీజేపీ చలి కాచుకుంటోంది…: కేటీఆర్‌

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలపై ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. కులం, మతం పేరుతో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో 30 ఏళ్లలో కులపిచ్చి, మతపిచ్చి ఎక్కువైందన్నారు. ఖమ్మం జిల్లా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రూ.11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్‌ ఫౌంటైన్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. రఘునాథపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని కేటీఆర్‌ అన్నారు. విద్వేషం తప్ప మరేదానిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఇతర మతాలపై విషం చిమ్మే వ్యక్తులు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. దేశంలో ఎందుకు ఈ విపరీత ధోరణులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆలోచన చేయాలన్నారు. నిన్న ప్రార్థనల అనంతరం 25 కోట్ల మంది ముస్లిం సోదరులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారన్నారు. రెడ్లకు పగ్గాలు ఇస్తేనే తాము అధికారంలోకి వస్తామని రేవంత్‌ అంటున్నారని.. అలాంటి కుల పిచ్చి వాళ్లు కావాలా.. అన్ని కులాల వాళ్లు కావాలనే కేసీఆర్‌ కావాలా? అని ప్రజలను కేటీఆర్‌ ప్రశ్నించారు. కులం ఒక్కటే ఓట్లేస్తే కుల సంఘానికి మాత్రమే నాయకుడు అవుతారన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ఓట్లు వేస్తే వారు ఏం చేశారని ప్రశ్నించారు. చాలా కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను ఎందుకు తేలేకపోయిందని ప్రశ్నించారు. కొత్తగా ఆ పార్టీ చేసేదేమీ ఉండబోదన్నారు. 35 ఏళ్లలో చైనా ఆర్థిక శక్తిగా ఎదిగిందని.. కానీ భారత్‌లో ఎందుకు జరగడం లేదో ఆలోచన చేయాలన్నారు. ‘1987లో భారతదేశం ఆర్థిక పరిస్థితి, చైనా ఆర్థిక పరిస్థితి సేమ్‌. కానీ ఈ 35 ఏళ్ల తర్వాత చూస్తే.. చైనా 16 ట్రిలియన్‌ డాలర్లతో ముందుకు దూసుకుపోయింది. మనం మాత్రం 3 ట్రిలియన్‌ డాలర్లతో వెనుకబడిపోయాం. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా చైనా ఎదిగింది. మనకేమో కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువైపోయింది. దీంతో అభివృద్ధి అడుగంటి పోయింది. పంచాయితీలు పెట్టుకోవాలని ఏ దేవుడు కూడా చెప్పలేదు..’ అని కేటీఆర్‌ అన్నారు.
ఒకే ఒక్కరోజు రూ.100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. గతంలో మురికికూపంగా ఉన్న లకారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు. లకారం చెరువు వద్ద తీగల వంతెనను ఏర్పాటు చేశామన్నారు. రోజుకు 2 వేల మంది అక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్‌లో జరగడం లేదని.. ఖమ్మం నగరాన్ని నంబర్‌ వన్‌గా మార్చాలన్నది మంత్రి అజయ్‌ లక్ష్యమని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img