వరంగల్లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర మంత్రులపై మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ తిట్టిపోతారు.. మళ్లీ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని రేపే అవార్డులు ఇస్తారని కేసీఆర్ అన్నారు. ఇక్కడున్న విద్యార్థులకు అన్ని విషయాలు తెలుసు.. ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల అండతో ఉద్యమం సాగించి, రాష్ట్రాన్ని సాధించామన్నారు.