రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. యునెస్కో నిబంధనల ప్రకారం పర్యాటకపరంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అందులో భాగంగా మంగళవారం రామప్పను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.