Friday, April 26, 2024
Friday, April 26, 2024

రేపటి నుంచి ఎంసెట్‌ పరీక్షలు

తెలంగాణలో రేపటి నుంచి ఎంసెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు జేఎన్‌టీయూ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2లక్షల 50వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.చేసుకున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందే చేరుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్‌కు సంబంధించి 4,5,6 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని, 9,10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img