తెలంగాణలో రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2లక్షల 50వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.చేసుకున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందే చేరుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్కు సంబంధించి 4,5,6 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని, 9,10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు.