పేదవాళ్లను పట్టించుకునే నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి కేటీఆర్. ధనవంతులను మరింత పెద్దవాళ్లను చేశారు ప్రధాని నరేంద్రమోడీ అని మండిపడ్డారు. మునుగోడు రోడ్డు షోలో ఆయన మాటాడుతూ, మీరు ఏ గట్టున ఉంటారో ఆలోచించుకోవాలంటూ రంగస్థలం సినిమా పాటను వాడుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రెండు భావజాలాల మధ్య ఊగిసలాడుతోందని అన్నారు. పేదవాళ్లను పట్టించుకునే నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు.14 నెలల్లో మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. నారాయణపురం ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి. మందు, మటన్ పెట్టగానే గందరగోళం కావొద్దు. ఎవరి వల్ల మన బతుకులు బాగుపడుతాయో ఆలోచించండి. మనది పేదల ప్రభుత్వం.. బీజేపీది పెద్దల ప్రభుత్వం. రైతు బంధు కావాలా.. రాబందు కావాలా.. ఆలోచించుకోండి అని అన్నారు.