ఆజాదీకా అమృతోత్సవ్ సందర్భాన్ని పురస్కరించుకుని టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఆగస్టు 15న జన్మించే చిన్నారులందరికి వారికి 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది తెలంగాణ ఆర్టీసీ. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెద్ద వయస్కులకు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. టీ24 బస్ టికెట్ ను ఆగస్టు 15న రూ.75కు మాత్రమే అమ్ముతామన్నారు.విడి రోజుల్లో ఈ టికెట్ ధర రూ.120 కావటం గమనార్హం. నేటి నుంచే అంటే మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని అలపిస్తాం. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులంతా అమ్రతోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.