టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా 3 డిఎలతో పాటు పండుగ అడ్వాన్స్ను కూడా ప్రకటించింది. ఈమేరకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధర్, ఎండి విసి సజ్జన్నార్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పెండిరగ్లో ఉన్న 5 డిఎలలో ప్రస్తుతం 3 డిఎలను చెల్లించనున్నట్లు, వాటి కోసం రూ.15 కోట్లతో పాటు డిఎ బకాయిల కోసం మరో రూ.20 కోట్లు కేటాయించడం జరుగుతోందన్నారు. అలాగే, ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్లను కూడా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.