Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్‌ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, గణేశ్‌ గుప్తా తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img