Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఈడీ నోటీసులతో టీ కాంగ్రెస్‌లో కుదుపులు.. ఢల్లీి నుంచి పిలుపు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు కాంగ్రెస్‌ పార్టీని కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ ఎదుర్కొనగా.. తాజాగా విరాళాలు ఇచ్చిన వారికీ ఈడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దాంతో నోటీసులు అందుకున్న వారికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డి, గీతా రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌కు ఈడీ నోటీసులు పంపింది. దాంతో నోటీసులు అందుకున్న వీరందర్నీ అధిష్టానం ఢల్లీికి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ విచారణకు ముందే ఇవాళ ఢల్లీిలో కాంగ్రెస్‌ నేతలు, ఆడిటర్లతో ఈ ఐదుగురు సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో కొందరు నిన్న సాయంత్రమే ఢల్లీికి వెళ్లగా.. మరికొందరు ఇవాళ వెళ్లారు.ఢల్లీిలో ఆడిట్‌ పరంగా, న్యాయపరంగా చర్చించే అవకాశం ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఈడీ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలనే వాటిపై చర్చించడానికే నోటీసులు అందుకున్న వారిని ఢల్లీికి పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలు ఈడీ విచారణ ఎదుర్కొంటుండగా.. తాజాగా కాంగ్రెస్‌ నేతలకు పిలుపు రావడంతో తెలంగాణ రాజకీయ పార్టీ నేతల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్‌ నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img