Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఉన్నట్టుండి ఆగిపోతున్న గుండెలు

విధుల్లో ఉన్న ఆర్టీసీ కండక్టర్‌కు హార్ట్‌ ఎటాక్‌..గంటల గ్యాప్‌లోనే ఆగిన మరో రెండు గుండెలు

ఉన్నట్టుండి గుండెలు ఆగిపోతున్నాయి. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నవాళ్లు కుప్పకూలి.. ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ జనాలతో మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. హర్ట్‌ ఎటాక్‌లతో జనాలు వరుసగా ప్రాణాలు విడుస్తున్నారు. జిమ్‌లో కసత్తులు చేస్తూ.. భరాత్‌లో డ్యాన్సులు చేస్తూ.. వేడుకలో ఉత్సాహం ఉంటూనే.. ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ కండక్టర్‌ విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురయ్యారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి సంగారెడ్డి నుంచి గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌కు బస్సులో వెళ్తున్న సమయంలో కండక్టర్‌ భిక్షపతికి ఛాతీలో నొప్పి వచ్చింది. కండక్టర్‌ ఇబ్బంది పడటాన్ని గమనించి.. హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి పదకొండున్నర సమయంలో భిక్షపతి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలిసి.. భిక్షపతి స్వస్థలం సిద్దిపేటలోని ఎండపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్‌ జిల్లా ముధోల్‌ మండలం చించాల గ్రామంలో.. గంటల వ్యవధిలోనే గుండెపోటులో ఇద్దరు మృతి చెందిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న 34 ఏళ్ల ఒరగంటి లక్ష్మణ్‌, 42 ఏళ్లున్న కండెల రాఘవులు గుండె పోటుతో ప్రాణాలు విడిచారు. ఆదివారం రాత్రి ఒరగంటి లక్ష్మణ్‌ గ్రామంలోని బంధువుల ఇంట్లో విందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో రోడ్డుపైనే కుప్పకూలాడు. లక్ష్మణ్‌ను గమనించిన స్థానికులు.. అతనికి సీపీఆర్‌ కూడా చేశారు. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు.లక్ష్మణ్‌ చనిపోయిన నాలుగు గంటలకే.. అంటే అర్థరాత్రి రెండు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కండెల రాఘవులుకు ఛాతిలో నొప్పి మొదలైంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పగానే.. హుటాహుటిన భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలోనే రాఘవులుకు మరోసారి హర్ట్‌ ఎటాక్‌ రావడంతో.. అక్కడే ప్రాణాలు వదిలాడు. దీంతో.. రాఘవులు కుటుంబంతో పాటు చించాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img