Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఏపీలో కరెంట్‌, నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నం

తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్‌
దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీ అన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ లేదు, నీళ్లు లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని… ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని… దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని తెలిపారు. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు. క్రెడాయ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img