కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇప్పటి వరకు 9,31,316 మంది లబ్ధి పొందారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలుపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బీసీ సంక్షేమం ద్వారా 4,35,365 మంది, గిరిజన సంక్షేమం ద్వారా 1,11,876 మంది లబ్ధి పొందారని, అలాగే మైనార్టీ సంక్షేమం ద్వారా 1,95,960 మంది, ఎస్సీ సంక్షేమం ద్వారా 1, 88,212 మంది లబ్ధి పొందారని తెలిపారు. ఈ పథకాల కోసం ఇప్పటి వరకు రూ. 7,720.8 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కరోనా కాలంలో కూడా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు కేసీఆర్ నిధులు మంజూరు చేశామని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశామని మంత్రి తెలిపారు.