Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కళ్యాణ లక్ష్మి, చెక్కులను అందజేసిన మంత్రి ఎర్రబెల్లి

దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయనన్ని సంక్షేమ పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇవాళ కేసీఆర్‌ పేదింటి యువతులకు మేనమామలా మారారని కొనియాడారు.వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 145 మంది లబ్దిదారులకు రూ. 1, 45,16, 820 కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ, పదింటి అమ్మాయిలకు పెండ్లి కోసం రూ. 1,00,116లను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు. కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు పరచాలని ఆయా రాష్ట్రాల ప్రజలు వారి ప్రభుత్వాలను కోరుతున్నారని గుర్తు చేశారు. ఒకవైపు కేంద్ర మంత్రులు, అధికారులు రాష్ట్రాన్ని అభినందిస్తున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ఇదేం విధానం? వాళ్ళవి నాలుకలా? తాటి మట్టలా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img