రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు చనిపోవడం దురదృష్టకరమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఈఘటనపై ఆయన స్పందిస్తూ..ఈనెల 25వతేదీన చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ అయ్యాయన్నారు. 34మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా%ౌౌ%వారిలో నలుగురు మహిళలు చనిపోయారన్నారు. మిగిలిన 30మందికి మళ్లీ టెస్టులు చేస్తామన్నారు.