Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోర్టుకి హాజరయిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య

కరీంనగర్‌ జిల్లా కోర్టుకి హాజరయ్యారు రచయిత..సామాజికవేత్త..ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య. ఆయన రచించిన ‘మతతత్వం’ పుస్తకం వివాదాస్పదమయింది. ఈ పుస్తకంలో న్యాయ వ్యవస్థను కించపరిచారంటూ ఆయనపై కేసు నమోదయింది. 2017లో బీజేపీ నేత, న్యాయవాది బేతి మహేందర్‌ రెడ్డి కరీంనగర్‌ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఐలయ్యపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కంచ ఐలయ్యకు పోలీసులు సమన్లను అందించారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img