వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు. ఈ భేటీ గవర్నర్ కు షర్మిల వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నర్సంపేటలో తనపై జరిగిన దాడి గురించి గవర్నర్ కు వివరించినట్లు తెలిపారు. సర్వేల్లో వైఎస్ఆర్ టీపీకి చాలా ఆదరణ పెరిగిందని తేలిందన్నారు. రాష్ట్రంలో తన పాదయాత్రను ఆపేందుకు కుట్ర చేశారన్నారు. తనకు ఆదరణ పెరగడంతో టీఆర్ఎస్ భయపడుతోందన్నారు.