ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్
నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ అమలును కొద్దికాలంపాటు వాయిదా వేయాల్సిందిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు. గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డు పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు.సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, గెజిట్ అమలుకు గడువు కావాలని కోరారన్నారు.