నిరంకుశ నిజాం రజాకార్లు, దేశ్ ముఖులను ఎదుర్కొన్న వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని శాయంపేట సర్కిల్లో గల ఆమె విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ ..ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తి దాయకం అని అన్నారు. ఐలమ్మ స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారు.అదే స్ఫూర్తిని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారు.