గత నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం హాస్పిటల్లో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్వో, %ణజనూ%లపై బదిలీ వేటు వేసింది. వీరిని కలుపుకొని మొత్తం 13 మంది వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.