డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా సీట్ల భర్తీపై ఈ నెల 20 వరకు స్టే విధిస్తున్నట్లు ఏపీ హైకోర్టు పేర్కొంది. మంగళవారం జీవో నెంబర్ 55పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ముతుకుమిల్లి విజయ్ వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 20 వరకు సీట్ల కేటాయింపు తాత్కాలికంగా నిలిపివేస్తూ.. కేసు తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.