తెలంగాణ ఏర్పాటును మోదీ పదే పదే అవమానిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీ వ్యతిరేకభావంతో ఉన్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. అంబేద్కర్ సూచనల మేరకే తెలంగాణ ఏర్పాటైందన్నారు. ప్రధానికి చితశుద్ధి ఉంటే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణపై ఆధిపత్యం కోసం ప్రధాని ప్రయత్నిస్తున్నారన్నారు. విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కోదండరాం ప్రశ్నించారు.