Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలంగాణలో వంద శాతం తొలి డోస్‌ పూర్తి


తెలంగాణలో వంద శాతం తొలి డోస్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ పూర్తైందని రాష్ట్ర వైద్యరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 61 శాతం మందికి రెండు డోస్‌లు పూర్తయినట్లు ప్రకటించారు. గ్రామాల నుంచి నగరాల వరకు వైద్య సిబ్బంది ఎంతో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి తోనే వ్యాక్సిన్‌ పంపిణీ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతోందని వెల్లడిరచారు. రెండేళ్లు కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుండగా ప్రస్తుతం ఒమిక్రాన్‌ రూపంలో వణకిస్తోంది. గత వేరియంట్ల కంటే శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో 130 కోట్లకు పైగా కోవిడ్‌ వ్యాక్సిన్‌లను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img