Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నేటికి రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.ఈ సందర్భంగా బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కేక్‌ కట్‌ చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని సీఎస్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img