Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

తెలంగాణ టెట్‌ రాసేందుకు వారికి కూడా అవకాశం : కన్వీనర్‌ రాధారెడ్డి

ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించిన పూర్తి సమాచార బులెటిన్‌, సిలబస్‌ను విడుదల చేసినట్లు కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. 2017 టెట్‌ సిలబస్‌ ప్రకారమే ఈ సారి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు. ఇక బీఈడీ, డీఈడీ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్‌ రాసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 12వ తేదీ వరకు స్వీకరించనున్నారు. పేపర్‌ 1, పేపర్‌ 2కు కలిసి దరఖాస్తు రుసుంను రూ. 300గా నిర్ణయించారు. ఒక పేపర్‌కు దరఖాస్తు చేసుకున్న ఇదే రుసుం వర్తించనుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేసేటప్పుడు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, స్టేట్‌, మొబైల్‌ నంబర్‌ తప్పనిసరి. ఆన్‌లైన్‌ పేమెంట్‌కు చివరి తేదీ ఏప్రిల్‌ 11. పేమెంట్‌ అయిన తర్వాత జర్నల్‌ నంబర్‌ వస్తోంది. ఈ నంబర్‌తో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. హెల్ప్‌ డెస్క్‌ సేవలు మార్చి 26 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి.జూన్‌ 12న టెట్‌ నిర్వహించి, 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. జూన్‌ 6 నుంచి టెట్‌ హాల్‌ టికెట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img