Monday, May 6, 2024
Monday, May 6, 2024

రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణ రైతాంగం పండిరచిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిరికి నిరసనగా చేపట్టబోయే ఆందోళనలు, భవిష్యత్‌ కార్యాచరణపై నియోజకవర్గస్థాయి టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తల సన్నహాక సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్‌, జిల్లా, మండల స్థాయి రైతుబంధు సమన్వయ సమితి, మార్కెట్‌ కమిటీ, పీఏసీఎస్‌, డిసిసిబీ, డీసీఎంస్‌, మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేయాలన్నారు. రైతులు పండిరచిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.యాసంగిలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.వన్‌ నేషన్‌-వన్‌ ప్రొక్యూర్మెంట్‌ ఫాలసీని వెంటనే ప్రకటించి, అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద అన్ని రకాల ధాన్యాలకు వర్తించే విధంగా ఏకరీతి జాతీయ ధాన్య సేకరణ విధానాన్ని రూపొందించాలన్నారు. వరి ధాన్యాన్ని వందశాతం పూర్తిగా ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడలని, లేకపోతే రైతన్నలతో కలిసి నిరస సెగలు దిల్లీని తాకేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img