Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొనార్‌ దుర్గాప్రసాద్‌

విశాలాంధ్ర`జవహర్‌ నగర్‌ : దివ్యాంగుల హక్కుల సాధన కోసం గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న దుర్గాప్రసాద్‌ ను తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు మున్నా తెలిపారు.ఈ మేరకు బుధవారం నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్‌ మున్నా రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ నయీమ్‌ సమక్షంలో దుర్గాప్రసాద్‌ కు నియామక పత్రం అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు.దివ్యాంగుల హక్కుల సాధన కోసం తన శక్తి వంచన మేరకు కృషి చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలపై పోరాడి వారికి న్యాయం చేస్తారని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు మున్నాకు,రాష్ట్ర అధ్యక్షులు నయీమ్‌ కు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img