తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు న్యాయాధికారులు ఉన్నారు. ఇందులో కాసోజు సురేందర్,చాడా విజయ్ భాస్కర్ రెడ్డి, సురేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్,జువ్వాది శ్రీదేవి, మీర్జా సైఫుల్లా బేగ్, నచ్చరాజు శ్రవణ్ కుమార్ వెంకట్ పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇక పదోన్నతి కోసం కొలీజియం సిఫార్సు చేసిన వారిలో జి. అనుపమ చక్రవర్తి ,ఎం.జి. ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు,ఎ. సంతోష్ రెడ్డి, డాక్టర్ డి. నాగార్జున ఉన్నారు.