Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

త్వరలో కొత్త పార్టీ పెడుతున్నా: తీన్మార్‌ మల్లన్న

త్వరలోనే రాజకీయ పార్టీని పెడుతున్నట్టు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న ప్రకటించారు. తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని, రాష్ట్ర సంపదను వీరు కొల్లగొడుతున్నారని, ఆ 7,200 మంది వెలమ దొరల భరతం పడతానని అన్నారు. అందుకే మల్లన్న టీమ్‌ 7200 పేరుతో తాను ఉద్యమం చేస్తున్నానని అన్నారు. తాను ఏర్పాటు చేసిన ఈ టీమ్‌ బీజేపీ కన్నా లక్ష రెట్లు మేలని చెప్పారు. ఇకపై జీవితంలో తాను బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని తీన్మార్‌ మల్లన్న అన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ టీమ్‌ భయపడదని, మరో 10 రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్తానని తెలిపారు. ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో 10 లక్షల మందితో బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img