Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పట్టపగలే రైతుల్ని మోసం చేస్తున్న మీకు హ్యాట్సాఫ్‌ చిన్న దొర: షర్మిల సెటైర్‌

కేటీఆర్‌ ట్వీట్‌కు ఫేస్‌బుక్‌ వేదికగా షర్మిల కౌంటర్‌ ఇచ్చింది. రైతు బీమాకు రూ.1,450 కోట్లు ఎల్‌ఐసీకి ప్రభుత్వం చెల్లించింది. దాంతో రైతులందరికీ ఇన్సూరెన్స్‌ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం కావడం, ఎంతో గర్వంగా ఉందంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలోని 34 లక్షల రైతు కుటుంబాలకు ఈ ఏడాది ప్రీమియం చెల్లించడం ఎంతో గర్వంగా ఉందంటూ ఆనందంతో కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ నిన్న చేసిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌తో షర్మిల ఇవాళ మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చిన్న దొర అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు. రాష్ట్రంలో కౌలు రైతులను అసలు రైతులే కాదని, కేవలం 37 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు బీమా కట్టి.. మిగతా 30 లక్షల మంది రైతులను మరిచి జబ్బలు చరుచుకొంటున్నారు అని విమర్శించారు. రైతులకు బీమా ఇస్తున్నామని కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్తూ.. పట్టపగలే రైతులను నిలువునా మోసం చేస్తున్న మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చిన్న దొరా అంటూ ఎద్దేవా చేశారు. రైతులు చచ్చిన పర్వాలేదనే తీరులో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ ఆమె విమర్శించారు. ‘‘18 లక్షల మంది కౌలు రైతులను అసలు రైతులే కాదని.. 67 లక్షల మందికి రైతుబంధు ఇస్తూ.. 37 లక్షల రైతులకు మాత్రమే రైతు బీమా కట్టి.. మిగతా 30 లక్షల మంది రైతులు చచ్చినా పర్వాలేదని.. వాళ్లు రైతు బీమాకు పనికి రారని.. ఆ రైతులు మరణిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని ఆగం చేస్తూ.. రైతులను ఆదుకుంది మేమే అని జబ్బలు చరుచుకొంటూ.. రైతులు అందరికీ బీమా ఇస్తున్నామని కండ్లు ఆర్పకుండా అబద్ధాలు చెబుతూ, పట్టపగలే రైతులను నిలువునా మోసం చేస్తూ .. మేము పెద్ద రైతులమని చెప్పుకు తిరుగుతున్న .. మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చిన్న దొర..’’ అంటూ షర్మిల పోస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img