Friday, April 26, 2024
Friday, April 26, 2024

పారదర్శకంగా ‘డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక : మంత్రి కేటీఆర్‌

లాటరీ పద్దతిలో అత్యంత పారదర్శకంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను అర్హులకు కేటాయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని అత్యంత నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను అందజేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల పనుల పురోగతిపై కేటీఆర్‌ సమీక్షించారు. ముస్తాబాద్‌ మండల పరిధిలోని చీకొడు, మోర్రయిపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, బండలింగంపల్లి, అక్కపల్లి గ్రామాల్లో, గంభీరావుపేట మండలం, తంగళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మంజూరైన ఇండ్లను సాధ్యమైనంత త్వరగా గ్రౌండిరగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరైన మొత్తం 6,886 డబుల్‌ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img