Friday, April 26, 2024
Friday, April 26, 2024

పెద్దాయన పేరు నిలబెడతా.. రైతు సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం పని చేస్తా..

పాదయాత్రలో వైఎస్‌ షర్మిల
కేసీఆర్‌ను నమ్మి రెండు సార్లు అధికారం కట్టబెడితే.. కనీసం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అందించలేకపోయారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం, నారపనేనిపల్లి, గౌండ్లపాలెం గ్రామాల్లో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్‌ 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని.. కానీ ఆయన పథకాలు ప్రతి గుండెను, ప్రతి గడపను తాకాయని షర్మిల చెప్పుకొచ్చారు. మీ అభిమానం చూస్తుంటే వైఎస్సార్‌ ఇంకా బ్రతికే ఉన్నారనిపిస్తోందన్నారు. తెలంగాణలో పేద ప్రజలకు సంక్షేమ పాలన అందడం లేదన్నారు. సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పెట్టామని తెలిపారు. కేసీఆర్‌ను రెండు సార్లు గెలిపించినా ప్రజల పక్షాన కాకుండా ఆయన స్వార్థం కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి వర్గాన్ని కేసీఆర్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాలో కేసీఆర్‌ మోసం చేయని వర్గమే లేదన్నారు. ‘మాట తప్పని.. మడమ తిప్పని వైఎస్సార్‌ బిడ్డగా హామీ ఇస్తున్నా.. వైఎస్సార్‌ పాలన మళ్లీ తీసుకొస్తా.. ప్రతి వర్గాన్ని ఆదరించి ఈ రాజన్న బిడ్డ సాధ్యం చేసి చూపిస్తుంది. పెద్దాయన పేరును నిలబెడతా. రైతు సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం పని చేస్తా. పేద బిడ్డలను ఉచితంగా చదివిస్తా.. ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందిస్తా.. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకాలకు పెద్ద పీట వేస్తా..’ అని హామీలనిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img