కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో కేసీఆర్ ఒక్కరేనని..బీజేపీ మోసాలను అన్ని వేదికల్లో ప్రశ్నిస్తున్నారనే కోపంతోనే కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ.. అమిత్ షాలకు వణుకు పుడుతోందన్నారు.
కేంద్రంలో నడుస్తోంది మోదీ ప్రభుత్వం కాదు.. ఏడీ ప్రభుత్వం, అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఎదుర్కోలేకనే.. బీజేపీ ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేస్తోందని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ఉద్యమంలో కూడా కేసీఆర్ పై ఇలాంటి ఆరోపణలు చేసినా.. ఉక్కు సంకల్పంతో నిలబడ్డారని వివరించారు. కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక.. బీజేపీ బురద జల్లే రాజకీయం చేస్తోందని విమర్శించారు. తప్పుడు కేసులకు, కాసులకు టీఆర్ఎస్ లొంగిపోదు.. భయపడబోదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ దేనికి ఆదరదు బెదరదన్నారు. కేసీఆర్ రాజీపడి ఉంటే.. తెలంగాణ వచ్చేది కాదన్నారు బాల్క సుమన్. కళంకితులు, అక్రమార్కుల అడ్డాగా బీజేపీ మారిందని ఆరోపించారు.సీబీఐ.. సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా మారిపోయిందని బాల్క సుమన్ ఆరోపించారు. సింథియా, హేమంత్ బిశ్వా శర్మ బీజేపీలో చేరగానే.. ఈడీ విచారణ ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. సోనియా సహా ప్రత్యర్థి పార్టీలన్నిటిపై.. కేంద్రం సీబీఐ, ఈడీలతో దాడులు చేస్తోందని ఆరోపించారు. కశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు.. బీజేపీ అనుబంధ విభాగాలుగా మారి… సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. అస్థిరపరిచే రాజకీయాలకు.. అస్తిత్వ రాజకీయాలకు.. తెలంగాణలో యుద్ధం మొదలైందన్నారు.కాంగ్రెస్ వాళ్లు ఢల్లీికి సంచులు మోసేవారని.. బీజేపీ నేతలు బూట్లు మోస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ బానిస సంజయ్ లా మారారని సెటైర్లు వేశారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను ఉద్ధరిస్తాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ శిఖండి రాజకీయాలు.. కేసీఆర్ ను ఏమి చేయలేవని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు పెద్దమనసు ఉంది కాబట్టే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు బతికిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. కవిత ఇంటిపై దాడి చేస్తారా.. తాము తలచుకుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ తిరగగలరా అని ప్రశ్నించారు. బండి సంజయ్ బూట్లు మోయడం కాదు.. తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని హితవుపలికారు. దమ్ముంటే కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు అమిత్ షాతో సమాధానాలు చెప్పించాలని ఛాలెంజ్ చేశారు. కోమటిపెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. మునుగోడులో చిత్తుచిత్తుగా ఓడిపోతారని అన్నారు.