టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
బీసీల్లో నలుగురికి మంత్రి పదవులిస్తే.. బీసీలందరికీ మేలు జరుగుతుందా? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించారని, సంక్షేమ పథకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. . టీడీపీ ఏర్పడక ముందు బీసీలకు గుర్తింపే లేదని అన్నారు. రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి..బీసీలకు జగన్రెడ్డి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీల నిధులను జగన్రెడ్డి దారి మళ్లిస్తున్నారని అన్నారు.