Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మహోన్నత వ్యక్తి పీవీ నర్సింహారావు : తలసాని

పీవీ నర్సింహారావు దేశానికి ఎనలేని సేవలు అందించారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొనియాడారు. గురువారం పీవీ 17 వ వర్ధంతి సందర్భంగా పీవీమార్గ్‌లోని జ్ఞాన భూమిలో గల పీవీ ఘాట్‌ పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమర్ధవంతమైన పాలనతో ప్రపంచ దేశాలలో భారత దేశ ఖ్యాతిని చాటిన మహోన్నత వ్యక్తి పీవీ నర్సింహారావు అని అన్నారు. పీవీ బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. దేశం గర్వించే విధంగా సమర్ధవంతమైన పాలనతో ప్రజాధారణ పొందారని చెప్పారు. తాను తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి పథంలో వెళుతుందని గుర్తు చేశారు.పీవీ సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఆయన శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించి గౌరవించుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పీవీ సేవలను గుర్తించక పోవడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ప్రభుత్వ సలహాదారు రమణా చారి, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img