Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మాజీ మంత్రి జానారెడ్డికి అస్వస్థత

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతకు గురవడంతో యశోద హాస్పిటల్ లో చేరారు. మోకాలి శాస్త్ర చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లారు. డాక్టర్లు ఆయన్ను పూర్తి చెకప్ చేశారు. జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఎంజియోగ్రామ్ టెస్ట్ చేసిన డాక్టర్లు.. స్టంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం జానారెడ్డి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. జానారెడ్డి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img