మునుగోడులో జరగనున్న ఎన్నికల్లో సీపీఐ పార్టీ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీని ఓడిరచే సత్తా టీఆర్ఎస్కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్ఎస్కు మద్ద్దతు పలుకుతున్నామని చెప్పారు. బీజేపీని ఓడిరచడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్నారు.అందువల్ల బీజేపీని ఓడిరచే పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.ఇది మునుగోడుకే పరిమితం కాదని, భవిష్యత్లో కూడా టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని వెల్లడిరచారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడిరచేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని సీఎం కేసీఆర్ తమను ఆహ్వానించారని చెప్పారు.